రామన్నపేట: మండల పరిధిలోని నీరు నెములకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆర్థిక సహాయం అందించారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన, పనులను పరిశీలించి తన వంతుగా రూ.75,000 విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నీరు నెముల గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్థుల సహకారం అభినందనీయమని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామ ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో పంతులు సిద్ధాంతి బేతోజు సత్యనారాయణ శాస్త్రి, నీరు నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, రామన్నపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గౌడ కుల సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి