శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం
శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం
Komidala Mahender reddy
శ్రీ కనకదుర్గ ఆలయం వార్షిక మహోత్సవానికి ఆహ్వానం చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ పాలకవర్గం ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న దేవస్థానం 23వ వార్షిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్సవాలను ప్రారంభించాలని ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా మహోత్సవాల కరపత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ, డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారం లింగస్వామి, జిట్టా సాయిలు, వనమా నిఖిల్ కుమార్, నాయకులు బెల్లి సత్తయ్య, పన్నాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి