Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:09 AM

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం
19-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో ఉన్న శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ప్రతి సోమవారం ఉదయం ప్రధాన అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయంలో ప్రతిరోజూ భగవద్గీత పారాయణం జరుగుతుండగా, ప్రస్తుతం 20వ సారి పారాయణం కొనసాగుతోందని తెలిపారు. ప్రతి సోమవారం కాలభైరవ అష్టకం పారాయణం నిర్వహిస్తూ, శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడిని స్మరించడం ద్వారా అజ్ఞానం, భయం, దుఃఖం తొలగి శక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించబడుతుందని, దీని ద్వారా భక్తులకు భక్తి, ధైర్యం పెరగడంతో పాటు అనారోగ్యం, శత్రువులు, కష్టాల నుండి దైవిక రక్షణ లభిస్తుందని నమ్మకం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహాశెట్టి శివలింగ పాటిల్, సభ్యులు ముత్యపు హనుమాన్లు, మహాశెట్టి కాశీనాథ్ పాటిల్, ముత్యాల మహేష్ కుమార్, పెండ్కర్ దీపక్, దారం కృష్ణమూర్తి, దత్తు సౌకారి, కిషన్ రావు, వెంకట్ రావు, బాబురావు, లక్ష్మయ్య, అశోక్, కృష్ణ సెట్, వడ్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం వినేందుకు, చదవడానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

Sthanikam

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో ఉన్న శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ప్రతి సోమవారం ఉదయం ప్రధాన అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయంలో ప్రతిరోజూ భగవద్గీత పారాయణం జరుగుతుండగా, ప్రస్తుతం 20వ సారి పారాయణం కొనసాగుతోందని తెలిపారు. ప్రతి సోమవారం కాలభైరవ అష్టకం పారాయణం నిర్వహిస్తూ, శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడిని స్మరించడం ద్వారా అజ్ఞానం, భయం, దుఃఖం తొలగి శక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించబడుతుందని, దీని ద్వారా భక్తులకు భక్తి, ధైర్యం పెరగడంతో పాటు అనారోగ్యం, శత్రువులు, కష్టాల నుండి దైవిక రక్షణ లభిస్తుందని నమ్మకం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహాశెట్టి శివలింగ పాటిల్, సభ్యులు ముత్యపు హనుమాన్లు, మహాశెట్టి కాశీనాథ్ పాటిల్, ముత్యాల మహేష్ కుమార్, పెండ్కర్ దీపక్, దారం కృష్ణమూర్తి, దత్తు సౌకారి, కిషన్ రావు, వెంకట్ రావు, బాబురావు, లక్ష్మయ్య, అశోక్, కృష్ణ సెట్, వడ్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం వినేందుకు, చదవడానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News