Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కన్నతల్లిని, కళ్లులేని అన్నను కాటేసిన కనికరం లేని చెల్లి! ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 10:52 PM

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం

శ్రీ దత్తాత్రేయ ఆలయంలో 20వ సారి భగవద్గీత పారాయణం ప్రారంభం
April 19, 2026 09:01 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో ఉన్న శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ప్రతి సోమవారం ఉదయం ప్రధాన అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయంలో ప్రతిరోజూ భగవద్గీత పారాయణం జరుగుతుండగా, ప్రస్తుతం 20వ సారి పారాయణం కొనసాగుతోందని తెలిపారు. ప్రతి సోమవారం కాలభైరవ అష్టకం పారాయణం నిర్వహిస్తూ, శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడిని స్మరించడం ద్వారా అజ్ఞానం, భయం, దుఃఖం తొలగి శక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించబడుతుందని, దీని ద్వారా భక్తులకు భక్తి, ధైర్యం పెరగడంతో పాటు అనారోగ్యం, శత్రువులు, కష్టాల నుండి దైవిక రక్షణ లభిస్తుందని నమ్మకం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహాశెట్టి శివలింగ పాటిల్, సభ్యులు ముత్యపు హనుమాన్లు, మహాశెట్టి కాశీనాథ్ పాటిల్, ముత్యాల మహేష్ కుమార్, పెండ్కర్ దీపక్, దారం కృష్ణమూర్తి, దత్తు సౌకారి, కిషన్ రావు, వెంకట్ రావు, బాబురావు, లక్ష్మయ్య, అశోక్, కృష్ణ సెట్, వడ్ల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం వినేందుకు, చదవడానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News