శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్పో’
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ‘నేషనల్ సైన్స్ ఎక్స్పో’
Sthanikam District Staff Reporter
భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 'నేషనల్ సైన్స్ డే' పురస్కరించుకుని శనివారం నిర్వహించిన 'నేషనల్ సైన్స్ ఎక్స్పో' కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి, వినూత్నమైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ షో రెడ్డి గారు మాట్లాడుతూ.. సైన్స్ అనేది కేవలం రేపటి గురించి మాత్రమే కాదని, అది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించి తమ ప్రతిభను చాటారని ఆయన కొనియాడారు. అనంతరం, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. శ్రీధర్ సార్ (డైరెక్టర్) వీరరెహ్మాన్, (ఏజీఎం),అలీ, (కోఆర్డినేటర్),షో రెడ్డి (ప్రిన్సిపాల్),శేఖర్ సార్ (డీన్),వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సైన్స్ ఎక్స్పోను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి