సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం
సేవల మెరుగుదల కోసం పంచాయతీ కార్యదర్శుల నూతన బృందం
Krishna
నారాయణఖేడ్ మండల ఫోరం పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని నారాయణఖేడ్ టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మిస్కిన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉప్పరి సాయన్న, ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా పండిత సుధా, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి, ఖజాంచిగా శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా మాదప్ప, క్రీడల బాధ్యుడిగా రాజు, కార్యవర్గ సభ్యులుగా సురేష్, రాణి లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫోరం ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, సహాధ్యక్షుడు విద్యదర్ గౌడ్, ఉపాధ్యక్షుడు షేకలి శ్రీనివాస్, ఖజాంచి రమేష్, కార్యవర్గ సభ్యురాలు నాగలక్ష్మి, విభాగ బాధ్యుడు అరవింద్, మండల ఫోరం కార్యదర్శులు రాజ్ కుమార్, అనిల్, మహేందర్, ప్రియాంక, జ్యోతీ, వినయ్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి