సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్తో కలిసి ఖర్గేను కలిసిన: జహీరాబాద్ ఎంపీ
సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్తో కలిసి ఖర్గేను కలిసిన: జహీరాబాద్ ఎంపీ
Sthanikam joint District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను చైతన్యపరిచే కార్యక్రమాలపై ఖర్గే మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కూడా సురేష్ షెట్కర్ ఖర్గే దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేసి, మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది.ఈ భేటీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలి

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి