PRINT TIME: March 18, 2026 09:05 PM
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్తో కలిసి ప్రియాంక గాంధీని కలిసిన: ఎంపీ
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్తో కలిసి ప్రియాంక గాంధీని కలిసిన: ఎంపీ
March 18, 2026 07:42 PM
33 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam joint District Staff Reporter krishna
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజలకు చేరువయ్యే విధానాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రాంతీయ సమస్యలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం వంటి ముఖ్య అంశాలను కూడా ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకాలు వంటి విషయాలపై ఆమె సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ భేటీతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని నేతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి