PRINT TIME: April 17, 2026 09:16 PM
సాయిరాం ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
సాయిరాం ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
April 17, 2026 07:25 PM
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ బిక్షపతి ఆధ్వర్యంలో సాయిరాం ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, వాటిని సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని డాక్టర్లు, సిబ్బందికి వివరించారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని, రోగుల భద్రత కోసం ఫైర్ ఎక్విప్మెంట్, అలారంలు, ఎమర్జెన్సీ మార్గాలు సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నరేష్ రెడ్డి, మున్నాఫ్, తయాబ్, నవీన్ కుమార్, హైమద్, రవీందర్, చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి