స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర కరపత్రాల ఆవిష్కరణ
స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర కరపత్రాల ఆవిష్కరణ
Editor Desk
సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జాతర కరపత్రాలను దేవాలయ చైర్మన్ సారిక చిన్నరామయ్య మునగాల పోలీసు కేంద్ర ఉప నిరీక్షకుడు ప్రవీణ్ కుమార్కు అందజేశారు.జాతర నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉప నిరీక్షకుడు సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో శాంతియుత వాతావరణంలో జాతరను విజయవంతంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పల్లి సైదిరెడ్డి పాల్గొని జాతర ఏర్పాట్లపై చర్చించారు. గ్రామంలో జరిగే ఈ మహా జాతర భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలవాలని, సంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి