స్వయం ఉపాధి కోసం మహిళలకు కుట్టు మిషన్ల అందజేత:లయన్స్ క్లబ్
స్వయం ఉపాధి కోసం మహిళలకు కుట్టు మిషన్ల అందజేత:లయన్స్ క్లబ్
Sthanikam joint District Staff Reporter krishna
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ మరియు మోడీ టీ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ప్రోత్సాహకంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవరెడ్డి, నారాయణఖేడ్ శాసనసభ్యులు మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సాయి సంగమేశ్వర్ పాల్గొని రెండు కుట్టు మిషన్లను నిరుపేద మహిళలకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలని, ఈ కుట్టు మిషన్లు వారికి ఉపాధి అవకాశాలను కల్పించి కుటుంబాలకు ఆదాయ వనరుగా మారాలని ఆకాంక్షించారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ రాజ్ కుమార్, స్ట్రిక్ట్ చైర్మన్ చంద్రశేఖర్ ఆచార్య, మాజీ అధ్యక్షులు వెంకటరావు, రవి కుమార్, మహేష్ కుమార్, ట్రెజరర్ అబ్రార్ అహ్మద్, పీఆర్వో యూసుఫ్, లయన్స్ సభ్యులు పండరినాథ్ రావు, పాండురంగారెడ్డి, రమేష్, బక్షి శ్రీనివాస్ రావు, విజేందర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రముఖ వ్యాపారస్తులు బౌగి వెంకటేశం, మోడీ టీ ఏరియా ఎగ్జిక్యూటివ్ ఆనంద్ మరియు ఇతర ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి