సర్పంచ్ నేతృత్వంలో సింగీతం గ్రామంలో ఉద్యోగ మేళా విజయవంతం
సర్పంచ్ నేతృత్వంలో సింగీతం గ్రామంలో ఉద్యోగ మేళా విజయవంతం
Sthanikam joint District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2-3-2026 తేదీన జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కె. శ్రావణి నిరంజన్ నేతృత్వం వహించారు.మేళాలో ప్రముఖ వ్యవసాయ సంస్థ ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 30–40 మంది గ్రామ మరియు పరిసర ప్రాంతాల యువత ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నారు.సర్పంచ్ కె. శ్రావణి నిరంజన్ మాట్లాడుతూ, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం గ్రామ పంచాయతీ ప్రధాన లక్ష్యం అని, యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలను గ్రామానికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల నాయకులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి