Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:55 PM

సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
March 14, 2026 05:52 PM 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలం సింగీతం గ్రామంలో గ్రామ సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బాచూపల్లి ప్రాంతంలోని మమత ఆసుపత్రికి చెందిన వైద్య బృందం గ్రామానికి వచ్చి ప్రజలను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు ఇచ్చింది.ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు రక్తపోటు, చక్కెర వ్యాధి వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.చిన్నా పెద్దా అనేక మంది గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గ్రామానికి దగ్గరలోనే వైద్య సేవలు అందుబాటులో రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో తరచుగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని సర్పంచ్ కుస్నూర్ శ్రావణి నిరంజన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, అందుకే గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ ప్రాంతీయ సభ్యుడు కే నిరంజన్, ఉప సర్పంచ్ పి జి మహేష్, వార్డు సభ్యులు ప్రభాకర్, కే యాదమ్మ, మొగులయ్య, ప్రశాంత్, గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News