Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 09:17 PM

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
April 19, 2026 07:47 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

1982 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్నేహానికి మించినది లోకంలో మరొకటి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సమ్మేళనాల ద్వారా పాత స్నేహితులు ఒకచోట కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం అభినందనీయమని తెలిపారు. కలిసి చదివిన వారు వివిధ రంగాలలో స్థిరపడి మళ్లీ కలుసుకోవడం స్నేహ బంధానికి ఉన్న విలువను తెలియజేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన రమేష్, చింత గోపాల్, అశోక్ కుమార్, శ్రీనివాస్, అమ్రాది మల్లికార్జున్, కరుణాకర్, లింగం, మేడం కృష్ణ, పద్మలత, గీత తదితర మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News