స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Krishna
1982 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్నేహానికి మించినది లోకంలో మరొకటి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సమ్మేళనాల ద్వారా పాత స్నేహితులు ఒకచోట కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం అభినందనీయమని తెలిపారు. కలిసి చదివిన వారు వివిధ రంగాలలో స్థిరపడి మళ్లీ కలుసుకోవడం స్నేహ బంధానికి ఉన్న విలువను తెలియజేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన రమేష్, చింత గోపాల్, అశోక్ కుమార్, శ్రీనివాస్, అమ్రాది మల్లికార్జున్, కరుణాకర్, లింగం, మేడం కృష్ణ, పద్మలత, గీత తదితర మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి