Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:07 PM

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

స్నేహ బంధాన్ని గుర్తుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం
April 19, 2026 07:47 PM 221 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

1982 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్నేహానికి మించినది లోకంలో మరొకటి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సమ్మేళనాల ద్వారా పాత స్నేహితులు ఒకచోట కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం అభినందనీయమని తెలిపారు. కలిసి చదివిన వారు వివిధ రంగాలలో స్థిరపడి మళ్లీ కలుసుకోవడం స్నేహ బంధానికి ఉన్న విలువను తెలియజేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన రమేష్, చింత గోపాల్, అశోక్ కుమార్, శ్రీనివాస్, అమ్రాది మల్లికార్జున్, కరుణాకర్, లింగం, మేడం కృష్ణ, పద్మలత, గీత తదితర మిత్రబృందం సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News