Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:09 AM

సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం

సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం

సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం
19-04-2026 440 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ అధ్యక్షుడు గంధిగరాజు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు రుద్రాభిషేకం, 8 గంటల 30 నిమిషాలకు ధ్వజారోహణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులు, లింగాయత్ సమాజ సభ్యులు కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు అనిమిశెట్టి జయప్రకాష్ తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్తగా, తత్వవేత్తగా సమానత్వ భావనను సమాజంలో వ్యాప్తి చేసిన మహానుభావుడని, కుల వ్యవస్థ, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు పోరాడి ప్రతి వ్యక్తి శ్రమకు గౌరవం ఇవ్వాలని బోధించినట్లు తెలిపారు. సదాశివపేటలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపను పొందాలని సమాజ సభ్యులు కోరారు. సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరగనుండగా, రాత్రి 9 గంటలకు డోలారోహణ కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ చేయనున్నారు.

Sthanikam

సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం

Article Image

సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ అధ్యక్షుడు గంధిగరాజు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు రుద్రాభిషేకం, 8 గంటల 30 నిమిషాలకు ధ్వజారోహణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులు, లింగాయత్ సమాజ సభ్యులు కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు అనిమిశెట్టి జయప్రకాష్ తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్తగా, తత్వవేత్తగా సమానత్వ భావనను సమాజంలో వ్యాప్తి చేసిన మహానుభావుడని, కుల వ్యవస్థ, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు పోరాడి ప్రతి వ్యక్తి శ్రమకు గౌరవం ఇవ్వాలని బోధించినట్లు తెలిపారు. సదాశివపేటలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపను పొందాలని సమాజ సభ్యులు కోరారు. సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరగనుండగా, రాత్రి 9 గంటలకు డోలారోహణ కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ చేయనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News