సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం
సమానత్వ సందేశంతో బసవ జయంతి వేడుకలు నిర్వహణకు సిద్ధం
Krishna
సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ అధ్యక్షుడు గంధిగరాజు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకు రుద్రాభిషేకం, 8 గంటల 30 నిమిషాలకు ధ్వజారోహణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులు, లింగాయత్ సమాజ సభ్యులు కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు అనిమిశెట్టి జయప్రకాష్ తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్తగా, తత్వవేత్తగా సమానత్వ భావనను సమాజంలో వ్యాప్తి చేసిన మహానుభావుడని, కుల వ్యవస్థ, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు పోరాడి ప్రతి వ్యక్తి శ్రమకు గౌరవం ఇవ్వాలని బోధించినట్లు తెలిపారు. సదాశివపేటలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపను పొందాలని సమాజ సభ్యులు కోరారు. సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరగనుండగా, రాత్రి 9 గంటలకు డోలారోహణ కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ చేయనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి