సమాజానికి సేవ చేయడమే గొప్ప ధర్మం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
సమాజానికి సేవ చేయడమే గొప్ప ధర్మం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Sthanikam joint District Staff Reporter krishna
సమాజ శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకొని ప్రజలకు ఉచిత సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణఖేడ్ లయన్స్ క్లబ్ను స్థాపించడం జరిగిందని లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాలకు తోడ్పాటును అందించడం, అవసరమైన వారికి సహాయం చేయడం లయన్స్ క్లబ్ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర సౌజన్యంతో కడపల్ గ్రామానికి చెందిన శేఖర్ ఆచార్య పూర్వ విద్యార్థి బేగరి శ్రీజ వివాహ సందర్భంగా వధూవరులకు పుస్తె మట్టలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, సమాజంలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ పనిచేస్తోందన్నారు.నారాయణఖేడ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం, అనాధలకు నిత్యావసర వస్తువులు అందించడం, మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ చేయడం, వికలాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు అందించడం, మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు.అదేవిధంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అనేక మందికి కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయించామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని పేద, నిరుపేద వర్గాలకు సహాయం అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మరింత సేవ చేయాలని సంకల్పించామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాయి సంగమేశ్వర, జోన్ చైర్మన్ రాజ్ కుమార్, డి.సి. చంద్రశేఖర్ ఆచార్య, సభ్యులు వెంకట్రావు, అంజిరెడ్డి, రవికుమార్, మల్లేశం, ముదసిర్, యూసఫ్, బసవచైతన్య, కడపల్ మాజీ ఎంపీటీసీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి