సైన్స్ ఫేర్తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్
సైన్స్ ఫేర్తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్
స్థానికం బృందం
ఆదోని: పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న సరస్వతి శశి మందిర్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలు ఆకట్టుకున్నాయి.
పాఠశాల ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు టిడిపి యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు తమ ప్రయోగాల ఉద్దేశ్యం, విధానాన్ని వివరించగా ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చిన్న వయసులోనే పరిశోధనాత్మక దృక్పథం అలవడితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి