Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 01:14 AM

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్

సైన్స్ ఫేర్‌తో సందడిగా మారిన సరస్వతి శశి మందిర్
March 01, 2026 07:52 PM 120 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న సరస్వతి శశి మందిర్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థులు రూపొందించిన వినూత్న శాస్త్రీయ నమూనాలు ఆకట్టుకున్నాయి.

పాఠశాల ప్రిన్సిపల్ ఆహ్వానం మేరకు టిడిపి యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు తమ ప్రయోగాల ఉద్దేశ్యం, విధానాన్ని వివరించగా ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చిన్న వయసులోనే పరిశోధనాత్మక దృక్పథం అలవడితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభమని సూచించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాల యాజమాన్యం మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News