Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:48 PM

సైన్స్ ఎక్స్‌పోతో విద్యార్థుల సృజనాత్మకతకు నూతన దిశ, ప్రిన్సిపల్ శౌరెడ్డి

సైన్స్ ఎక్స్‌పోతో విద్యార్థుల సృజనాత్మకతకు నూతన దిశ, ప్రిన్సిపల్ శౌరెడ్డి

సైన్స్ ఎక్స్‌పోతో విద్యార్థుల సృజనాత్మకతకు నూతన దిశ, ప్రిన్సిపల్ శౌరెడ్డి
01-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని నేషనల్ సైన్స్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకుని కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శౌరెడ్డి మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే ముఖ్యమైన సాధనమని తెలిపారు. సైన్స్ అనేది కేవలం పాఠ్యాంశం మాత్రమే కాకుండా రేపటి సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వారి సృజనాత్మకతకు నిదర్శనమని అభినందించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్, ఏజీఎం వీర రహమాన్, కోఆర్డినేటర్ అలీ, డి.ఎన్. శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సైన్స్ ఎక్స్‌పోతో విద్యార్థుల సృజనాత్మకతకు నూతన దిశ, ప్రిన్సిపల్ శౌరెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని నేషనల్ సైన్స్ ఎక్స్‌పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు ఆకట్టుకుని కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శౌరెడ్డి మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే ముఖ్యమైన సాధనమని తెలిపారు. సైన్స్ అనేది కేవలం పాఠ్యాంశం మాత్రమే కాకుండా రేపటి సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు వారి సృజనాత్మకతకు నిదర్శనమని అభినందించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్, ఏజీఎం వీర రహమాన్, కోఆర్డినేటర్ అలీ, డి.ఎన్. శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News