Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 11:51 AM

సైన్స్ అభివృద్ధే దేశాభివృద్ధికి సూచిక జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చాట్రాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

సైన్స్ అభివృద్ధే దేశాభివృద్ధికి సూచిక జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చాట్రాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

సైన్స్ అభివృద్ధే దేశాభివృద్ధికి సూచిక జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చాట్రాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
March 01, 2026 06:00 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


చాట్రాయి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డి.పి.ఆర్.టి.యు చాట్రాయి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని సైన్స్ ఉపాధ్యాయులను గౌరవిస్తూ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చాట్రాయి మండలంలో సేవలందిస్తున్న సైన్స్ ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నంపేట ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, డి.పి.ఆర్.టి.యు రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగేశ్వరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా సీవి రామన్ కనుగొన్న “రామన్ ప్రభావం” గురించి వివరించి, భారత శాస్త్రవేత్తల ప్రతిభను గుర్తు చేశారు.

విద్యార్థి దశ నుంచే తార్కిక ఆలోచనలు, పరిశీలనా దృష్టి, ప్రయోగ పరికల్పనలపై అవగాహన కల్పించడం సైన్స్ ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నిత్యజీవితంలో సైన్స్ యొక్క ప్రాధాన్యతను వివరించి, శాస్త్ర–సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించుట ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు ఇ. రంగారావు, జి. సత్యన్నారాయణ రెడ్డి, కె. చంటిబాబు, కె. రామారావు, జి. పద్మజ, స్వాతి లను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో డి.పి.ఆర్.టి.యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షుడు బి.సి.హెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి. రామారావు, సంఘ నాయకులు సత్తెనపల్లి రాము, ధరావతు నాగేశ్వరావు, బి. రాందాస్, యన్. శ్రీనివాసరెడ్డి, పి. తిరుపతయ్య, చంద్రకళావతి, బి. గణేష్, ఎ. క్రాంతి, జె. రాజేష్ తదితరులు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News