PRINT TIME: June 22, 2026 12:55 PM
సదాశివపేటలో ఘోరం.. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
సదాశివపేటలో ఘోరం.. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
April 25, 2026 07:53 PM
1,609 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త రాజు (43) ఆమెతో గొడవపడి ఆగ్రహంతో ఇంట్లో ఉన్న రోకలి బండతో భార్య రాణి (40) తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. భార్య మృతి చెందినట్లు గుర్తించిన అనంతరం తాను చేసిన పనిపై మనస్తాపానికి గురైన రాజు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా, అనుమానమే ఈ దారుణ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి