Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:07 PM

సదాశివపేటలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు

సదాశివపేటలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు

సదాశివపేటలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు
April 20, 2026 02:51 PM 378 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర మందిరంలో శ్రీ విశ్వగురు మహాత్మ బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతల ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, సమాజ అధ్యక్షులు గందిగ రాజు, పెద్ద మఠం అప్పగారు లింగం స్వామి, రాష్ట్ర నాయకులు శివ చందర్ కుమార్ పాటిల్ తదితరులు హాజరై బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన నాయకులు, మహాత్మ గురు బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో వెలుగొందిన గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్తగా కులవ్యవస్థ, అంటరానితనం వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేశారని పేర్కొన్నారు. “కాయకమే కైలాసం” అనే మహాసూత్రంతో శ్రమకు గౌరవం తీసుకొచ్చి ప్రతి మనిషి సమానుడనే భావనను సమాజంలో నాటారని, అనుభవ మంటపం ద్వారా జ్ఞానం, ధర్మం, న్యాయం ప్రసారం చేసి సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు.మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ మాట్లాడుతూ, ఆ కాలంలోనే మహిళలకు సమాన హక్కులు కల్పించి వారికి గౌరవ స్థానం కల్పించిన మహానుభావుడని కొనియాడగా, అధ్యక్షులు గందిగ రాజు మాట్లాడుతూ ఆయన బోధనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూ సమానత్వం, మానవత్వానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్, ప్రధాన కార్యదర్శి సిద్దికేర్ వినోద్, కోశాధికారి అమరాధి రాచన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీర మహేందర్ (అడ్వకేట్), అలాగే సమాజ సభ్యులు రాచప్ప, రమేష్, రవి, సురేష్, శేఖర్, సతీష్, రవణప్ప, షాబాద్ వీరన్న, విశ్వనాథ్, ప్రవీణ్, లోకేష్, మల్లేశం, వీరు, వైద్యనాథ్, నర్సింల, నాగు తదితరులు పాల్గొనగా, వీరశైవ సమాజం సభ్యులు, పట్టణ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News