రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు
రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు
Krishna
“99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని మాయికోడ్, డావ్వుర్ గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామస్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటించడం, హెల్మెట్ ధరించడం, మితవేగంతో వాహనాలు నడపడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. గ్రామస్థులు కూడా చురుకుగా పాల్గొని రోడ్డు భద్రతకు సహకరిస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి