Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:47 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు
April 13, 2026 08:01 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

“99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని మాయికోడ్, డావ్వుర్ గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామస్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటించడం, హెల్మెట్ ధరించడం, మితవేగంతో వాహనాలు నడపడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. గ్రామస్థులు కూడా చురుకుగా పాల్గొని రోడ్డు భద్రతకు సహకరిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News