Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:20 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు
13-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

“99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని మాయికోడ్, డావ్వుర్ గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామస్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటించడం, హెల్మెట్ ధరించడం, మితవేగంతో వాహనాలు నడపడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. గ్రామస్థులు కూడా చురుకుగా పాల్గొని రోడ్డు భద్రతకు సహకరిస్తామని తెలిపారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు

Article Image

“99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని మాయికోడ్, డావ్వుర్ గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో గ్రామస్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటించడం, హెల్మెట్ ధరించడం, మితవేగంతో వాహనాలు నడపడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి మానూర్ ఎస్సై కోటేశ్వరరావు, పోలీసు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. గ్రామస్థులు కూడా చురుకుగా పాల్గొని రోడ్డు భద్రతకు సహకరిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News