రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం పరిధిలోని గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని చాప్టకే గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగం, అధిక వేగాన్ని నివారించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ సవిత బసప్ప, బిరాదర్ మాణిక్, సంగప్ప, నరసింహులు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి