Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:18 AM

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం
13-04-2026 207 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం పరిధిలోని గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని చాప్టకే గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగాన్ని నివారించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ సవిత బసప్ప, బిరాదర్ మాణిక్, సంగప్ప, నరసింహులు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం పరిధిలోని గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని చాప్టకే గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగాన్ని నివారించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ సవిత బసప్ప, బిరాదర్ మాణిక్, సంగప్ప, నరసింహులు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News