Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:12 PM

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం
April 13, 2026 12:37 PM 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం పరిధిలోని గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని చాప్టకే గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగాన్ని నివారించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ సవిత బసప్ప, బిరాదర్ మాణిక్, సంగప్ప, నరసింహులు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News