Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 02:21 PM

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపు కార్యక్రమం
April 13, 2026 12:37 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రం పరిధిలోని గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని చాప్టకే గ్రామంలో గ్రామస్తులతో సమావేశమై “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగాన్ని నివారించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ సవిత బసప్ప, బిరాదర్ మాణిక్, సంగప్ప, నరసింహులు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News