రోడ్డు భద్రత మన చేతుల్లోనే: ఎస్సై లవ కుమార్
రోడ్డు భద్రత మన చేతుల్లోనే: ఎస్సై లవ కుమార్
Krishna
సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వట్టిపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వాహనదారులతో అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్సై లవ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వాహనాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే వాహనాలు సక్రమ స్థితిలో ఉన్నవే నడపాలని చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్ఫోన్ ఉపయోగించడం, నిద్రలేమితో వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. అనంతరం వాహనదారులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి