Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:06 PM

రోడ్డు భద్రత మన చేతుల్లోనే: ఎస్సై లవ కుమార్

రోడ్డు భద్రత మన చేతుల్లోనే: ఎస్సై లవ కుమార్

రోడ్డు భద్రత మన చేతుల్లోనే: ఎస్సై లవ కుమార్
April 17, 2026 07:14 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వట్టిపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వాహనదారులతో అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్సై లవ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. వాహనాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే వాహనాలు సక్రమ స్థితిలో ఉన్నవే నడపాలని చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ ఉపయోగించడం, నిద్రలేమితో వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. అనంతరం వాహనదారులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News