రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులకు గాయాలు
కోదాడ మండలం రెడ్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శనివారం రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. ఉదయం ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళుతున్న రువ్వ శ్రావణ్, గడ్డం రవి చంద్రలకు ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో శ్రావణ్ కుమార్ నాలుకకు గాయం కాగా రవిచంద్ర కు చెయ్యి విరిగింది. విషయం తెలుసుకున్న కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ వైద్యశాలకు వెళ్లి ఉపాధ్యాయులను పరామర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి