Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 01:24 AM

రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్

రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్

రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్
March 10, 2026 06:08 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఈ నెల 18న జరగనున్న ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్) సందర్భంగా ఇద్గాహ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పరిశీలించారు. పండుగ రోజున పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించనున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా నమాజ్ నిర్వహణ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇద్గాహ్ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని,తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన ఇతర మౌలిక వసతులను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా పండుగ రోజున శాంతి భద్రతల పరంగా కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ముస్లిం సోదరులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నమాజ్ నిర్వహించుకునేలా మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, కౌన్సిలర్లు వివేకానంద, మహేందర్, లక్ష్మణ్, బాణపురం రాజు, షారుఖ్, మైతబ్, గోపాల్ రెడ్డి, విట్టల్, సుబర్, ఆనంద్, స్వామి, సమద్, అసిఫ్, సఫి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News