Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 04:11 AM

రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్

రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్

రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్
10-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఈ నెల 18న జరగనున్న ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్) సందర్భంగా ఇద్గాహ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పరిశీలించారు. పండుగ రోజున పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించనున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా నమాజ్ నిర్వహణ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇద్గాహ్ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని,తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన ఇతర మౌలిక వసతులను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా పండుగ రోజున శాంతి భద్రతల పరంగా కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ముస్లిం సోదరులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నమాజ్ నిర్వహించుకునేలా మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, కౌన్సిలర్లు వివేకానంద, మహేందర్, లక్ష్మణ్, బాణపురం రాజు, షారుఖ్, మైతబ్, గోపాల్ రెడ్డి, విట్టల్, సుబర్, ఆనంద్, స్వామి, సమద్, అసిఫ్, సఫి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఈ నెల 18న జరగనున్న ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్) సందర్భంగా ఇద్గాహ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పరిశీలించారు. పండుగ రోజున పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించనున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా నమాజ్ నిర్వహణ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇద్గాహ్ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని,తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన ఇతర మౌలిక వసతులను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా పండుగ రోజున శాంతి భద్రతల పరంగా కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ముస్లిం సోదరులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నమాజ్ నిర్వహించుకునేలా మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, కౌన్సిలర్లు వివేకానంద, మహేందర్, లక్ష్మణ్, బాణపురం రాజు, షారుఖ్, మైతబ్, గోపాల్ రెడ్డి, విట్టల్, సుబర్, ఆనంద్, స్వామి, సమద్, అసిఫ్, సఫి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News