రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్
రంజాన్ పండుగ సందర్భంగా ఇద్గాహ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన:మున్సిపల్ చైర్మన్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ఈ నెల 18న జరగనున్న ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్) సందర్భంగా ఇద్గాహ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పరిశీలించారు. పండుగ రోజున పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు నమాజ్ నిర్వహించనున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా నమాజ్ నిర్వహణ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇద్గాహ్ పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని,తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన ఇతర మౌలిక వసతులను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా పండుగ రోజున శాంతి భద్రతల పరంగా కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ముస్లిం సోదరులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నమాజ్ నిర్వహించుకునేలా మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, కౌన్సిలర్లు వివేకానంద, మహేందర్, లక్ష్మణ్, బాణపురం రాజు, షారుఖ్, మైతబ్, గోపాల్ రెడ్డి, విట్టల్, సుబర్, ఆనంద్, స్వామి, సమద్, అసిఫ్, సఫి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి