Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంగన్‌వాడీ సేవల బలోపేతానికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ – ఎమ్మెల్యే సంజీవరెడ్డి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 07:49 PM

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:
March 03, 2026 01:36 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరమైన, అవమానకరమైన కామెంట్లు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి కొందరు నీచంగా మాట్లాడుతున్నారని, తీవ్రంగా దూషణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా వీధి కుక్కల అంశంపై స్పందించిన తర్వాత నుంచే కొందరు తనను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు.

సోషల్ మీడియాలో రాయలేని భాషలో కామెంట్లు పెట్టడం, అసభ్యకరమైన మీమ్స్ సృష్టించడం, వ్యక్తిగతంగా అవమానించేలా పోస్టులు షేర్ చేయడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఇటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News