Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 03, 2026 04:11 AM

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:
March 03, 2026 01:36 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరమైన, అవమానకరమైన కామెంట్లు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి కొందరు నీచంగా మాట్లాడుతున్నారని, తీవ్రంగా దూషణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా వీధి కుక్కల అంశంపై స్పందించిన తర్వాత నుంచే కొందరు తనను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు.

సోషల్ మీడియాలో రాయలేని భాషలో కామెంట్లు పెట్టడం, అసభ్యకరమైన మీమ్స్ సృష్టించడం, వ్యక్తిగతంగా అవమానించేలా పోస్టులు షేర్ చేయడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఇటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News