Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:31 AM

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:
03-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరమైన, అవమానకరమైన కామెంట్లు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి కొందరు నీచంగా మాట్లాడుతున్నారని, తీవ్రంగా దూషణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా వీధి కుక్కల అంశంపై స్పందించిన తర్వాత నుంచే కొందరు తనను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు.

సోషల్ మీడియాలో రాయలేని భాషలో కామెంట్లు పెట్టడం, అసభ్యకరమైన మీమ్స్ సృష్టించడం, వ్యక్తిగతంగా అవమానించేలా పోస్టులు షేర్ చేయడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఇటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Sthanikam

రేణు దేశాయ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు:

Article Image

నటి రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరమైన, అవమానకరమైన కామెంట్లు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి కొందరు నీచంగా మాట్లాడుతున్నారని, తీవ్రంగా దూషణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా వీధి కుక్కల అంశంపై స్పందించిన తర్వాత నుంచే కొందరు తనను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు.

సోషల్ మీడియాలో రాయలేని భాషలో కామెంట్లు పెట్టడం, అసభ్యకరమైన మీమ్స్ సృష్టించడం, వ్యక్తిగతంగా అవమానించేలా పోస్టులు షేర్ చేయడం జరుగుతోందని ఆమె వెల్లడించారు. ఇటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News