PRINT TIME: April 20, 2026 10:41 PM
రాయికోడ్ మండల వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు
రాయికోడ్ మండల వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు
April 20, 2026 08:19 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బసవేశ్వరుని చిత్రపటాలకు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని, కులవ్యవస్థను వ్యతిరేకించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంస్కర్తని కొనియాడారు. ‘కాయకమే కైలాసం’ అనే ఆయన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అనుభవ మంటపం ద్వారా ఆయన చేపట్టిన సంఘ సంస్కరణలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల నాయకులు, లింగాయత్ సంఘం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి