Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:09 PM

రాయికోడ్ మండల వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

రాయికోడ్ మండల వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

రాయికోడ్ మండల వ్యాప్తంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు
April 20, 2026 08:19 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల వ్యాప్తంగా సోమవారం మహాత్మా బసవేశ్వరుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బసవేశ్వరుని చిత్రపటాలకు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని, కులవ్యవస్థను వ్యతిరేకించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంస్కర్తని కొనియాడారు. ‘కాయకమే కైలాసం’ అనే ఆయన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అనుభవ మంటపం ద్వారా ఆయన చేపట్టిన సంఘ సంస్కరణలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ గ్రామాల నాయకులు, లింగాయత్ సంఘం ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News