Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:12 PM

రవాణా సేవలు కొనసాగించేందుకు డిపో మేనేజర్ కీలక ప్రకటన

రవాణా సేవలు కొనసాగించేందుకు డిపో మేనేజర్ కీలక ప్రకటన

రవాణా సేవలు కొనసాగించేందుకు డిపో మేనేజర్ కీలక ప్రకటన
April 21, 2026 05:34 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ కార్యాలయంలో మంగళవారం డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నారాయణఖేడ్ డిపో పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు 22-04-2026 నుండి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలను కొనసాగించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలికంగా టికెట్ పరిశీలకులుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి గల వారు తమ పదవ తరగతి ఉత్తీర్ణత ధృవపత్రాల అసలు ప్రతులతో కలిసి 22-04-2026 ఉదయం నారాయణఖేడ్ డిపోకు హాజరై డిపో మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు నిరంతర రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యమని, దీనికి స్థానికుల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News