నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ కార్యాలయంలో మంగళవారం డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నారాయణఖేడ్ డిపో పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు 22-04-2026 నుండి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలను కొనసాగించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలికంగా టికెట్ పరిశీలకులుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి గల వారు తమ పదవ తరగతి ఉత్తీర్ణత ధృవపత్రాల అసలు ప్రతులతో కలిసి 22-04-2026 ఉదయం నారాయణఖేడ్ డిపోకు హాజరై డిపో మేనేజర్ను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు నిరంతర రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యమని, దీనికి స్థానికుల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.
PRINT TIME: August 07, 2026 01:14 AM
రవాణా సేవలు కొనసాగించేందుకు డిపో మేనేజర్ కీలక ప్రకటన
రవాణా సేవలు కొనసాగించేందుకు డిపో మేనేజర్ కీలక ప్రకటన
21-04-2026
68 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని రాష్ట్ర రహదారి రవాణా సంస్థ కార్యాలయంలో మంగళవారం డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నారాయణఖేడ్ డిపో పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు 22-04-2026 నుండి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సేవలను కొనసాగించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో తాత్కాలికంగా టికెట్ పరిశీలకులుగా విధులు నిర్వహించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి గల వారు తమ పదవ తరగతి ఉత్తీర్ణత ధృవపత్రాల అసలు ప్రతులతో కలిసి 22-04-2026 ఉదయం నారాయణఖేడ్ డిపోకు హాజరై డిపో మేనేజర్ను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు నిరంతర రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యమని, దీనికి స్థానికుల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి