PRINT TIME: March 03, 2026 04:06 AM
రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తిరువూరులో 9,677 పాస్ పుస్తకాలు అందజేత – ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
March 03, 2026 01:37 AM
2 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మొత్తం 21.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో 9,677 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు.
పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎలాంటి తప్పులు ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి సవరణలు చేసి అందజేస్తారని భరోసా ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రెవెన్యూ క్లినిక్ల ద్వారా వేగవంతంగా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల రెవెన్యూ అధికారులు, గ్రామ కూటమి పార్టీ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి