Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్ల బ్యాడ్జిలతో ఆర్టీసీ ఉద్యోగుల నిరసన, శంకర్ గౌడ్‌కు ఘన నివాళి కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 12:36 PM

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ
February 19, 2026 11:00 PM 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు,

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని విమర్శించారు. ఊహాజనిత అంకెల గారడీతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారని ఆరోపించారు.

పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయింపులు మొక్కుబడిగా ఉన్నాయని, సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు రూ.15,000 అంశాలపై ప్రస్తావన లేదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించకుండా నీరుగార్చారని విమర్శించారు.


భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లిందని, వారిని ఆదుకోవాలని కోరారు.

నూజివీడు నియోజకవర్గంలో పేదలు సాగు చేస్తున్న అటవీ భూములకు జారీ చేసిన ఫోర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి వేముల బక్కయ్య నాయకత్వం వహించగా, జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, జిల్లా కమిటీ సభ్యులు కలపాల వెంకటేశ్వరరావు, సర్వేసు భవాని, సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News