Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 07:44 AM

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ

రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేదంటూ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ర్యాలీ
February 19, 2026 11:00 PM 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు,

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని విమర్శించారు. ఊహాజనిత అంకెల గారడీతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారని ఆరోపించారు.

పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయింపులు మొక్కుబడిగా ఉన్నాయని, సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడపడుచులకు రూ.15,000 అంశాలపై ప్రస్తావన లేదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించకుండా నీరుగార్చారని విమర్శించారు.


భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మామిడి రైతులకు నష్టం వాటిల్లిందని, వారిని ఆదుకోవాలని కోరారు.

నూజివీడు నియోజకవర్గంలో పేదలు సాగు చేస్తున్న అటవీ భూములకు జారీ చేసిన ఫోర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి వేముల బక్కయ్య నాయకత్వం వహించగా, జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు, జిల్లా కమిటీ సభ్యులు కలపాల వెంకటేశ్వరరావు, సర్వేసు భవాని, సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News