రామన్నపేటలో ఇఫ్తార్ విందు
రామన్నపేటలో ఇఫ్తార్ విందు
స్థానికం బృందం
రామన్నపేట: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణ కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ మోటే రమేష్ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీలోని అర్ ఫాత్ మసీదులో ఇఫ్తార్ విందు, భోజన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జమీరుద్దీన్, మండల నాయకులు వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు ఎండి అక్రమ్, వార్డు సభ్యులు బండ లింగస్వామి, ఎండి అంజాద్, కొమ్ము రామస్వామి, మోటే మహేష్, గొరిగే శేఖర్, మైనార్టీ నాయకులు మీర్జా అస్లాం బేగ్, మీర్జా ఇనాయత్ బేగ్, అహ్మద్ అలీ, ఎండీ అలీం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటే రమేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఆత్మపరిశీలన, సేవాభావానికి ప్రతీకమని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి