Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:10 AM

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు

రామన్నపేటలో ఇఫ్తార్ విందు
February 28, 2026 08:52 PM 303 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణ కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ మోటే రమేష్ ఆధ్వర్యంలో మైనార్టీ కాలనీలోని అర్ ఫాత్ మసీదులో ఇఫ్తార్ విందు, భోజన కార్యక్రమం నిర్వహించారు. ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జమీరుద్దీన్, మండల నాయకులు వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు ఎండి అక్రమ్, వార్డు సభ్యులు బండ లింగస్వామి, ఎండి అంజాద్, కొమ్ము రామస్వామి, మోటే మహేష్, గొరిగే శేఖర్, మైనార్టీ నాయకులు మీర్జా అస్లాం బేగ్, మీర్జా ఇనాయత్ బేగ్, అహ్మద్ అలీ, ఎండీ అలీం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మోటే రమేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఆత్మపరిశీలన, సేవాభావానికి ప్రతీకమని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News