రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత
రామన్నపేట మండలంలో పలు గ్రామాలకు మంగళవారం విద్యుత్ నిలిపివేత
Editor Desk
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా మంగళవారం (03వ తేదీ) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది.
తుమ్మలగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం గ్రామాలలో వ్యవసాయ సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే లక్ష్మాపురం సబ్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాలలో కూడా సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ ప్రాంతం వరకు, అలాగే బస్టాండ్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కూడా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.
ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఏఈ ఎం. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. అభివృద్ధి పనుల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి