Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు
02-03-2026 405 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పలు గ్రామాల్లో భవనాలు, సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట మండల పరిధిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలు గ్రామాల్లో శంకుస్థాపనలు నిర్వహించారు.

నీర్నేముల గ్రామంలో మహిళా సమాఖ్య సంఘానికి నూతన భవన నిర్మాణంతో పాటు సి.సి రోడ్డు పనులకు పునాది వేశారు. నిధాన్‌పల్లి గ్రామంలో సిసి రోడ్లు, మహిళా సమాఖ్య సంఘ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. కొమ్మాయిగూడెం గ్రామంలో సి.సి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, రామన్నపేట మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సంఘానికి శాశ్వత భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేక భవనాలు నిర్మించడం ద్వారా వారి కార్యకలాపాలు విస్తరించి, ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు

Article Image

పలు గ్రామాల్లో భవనాలు, సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట మండల పరిధిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలు గ్రామాల్లో శంకుస్థాపనలు నిర్వహించారు.

నీర్నేముల గ్రామంలో మహిళా సమాఖ్య సంఘానికి నూతన భవన నిర్మాణంతో పాటు సి.సి రోడ్డు పనులకు పునాది వేశారు. నిధాన్‌పల్లి గ్రామంలో సిసి రోడ్లు, మహిళా సమాఖ్య సంఘ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. కొమ్మాయిగూడెం గ్రామంలో సి.సి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, రామన్నపేట మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సంఘానికి శాశ్వత భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేక భవనాలు నిర్మించడం ద్వారా వారి కార్యకలాపాలు విస్తరించి, ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News