రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు
రామన్నపేట మండలంలో అభివృద్ధి పనుల జోరు
స్థానికం బృందం
పలు గ్రామాల్లో భవనాలు, సి.సి రోడ్లకు శ్రీకారం
రామన్నపేట మండల పరిధిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పలు గ్రామాల్లో శంకుస్థాపనలు నిర్వహించారు.
నీర్నేముల గ్రామంలో మహిళా సమాఖ్య సంఘానికి నూతన భవన నిర్మాణంతో పాటు సి.సి రోడ్డు పనులకు పునాది వేశారు. నిధాన్పల్లి గ్రామంలో సిసి రోడ్లు, మహిళా సమాఖ్య సంఘ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు. కొమ్మాయిగూడెం గ్రామంలో సి.సి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, రామన్నపేట మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సంఘానికి శాశ్వత భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేక భవనాలు నిర్మించడం ద్వారా వారి కార్యకలాపాలు విస్తరించి, ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి