Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 03:45 PM

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం
March 02, 2026 12:24 PM 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.30 లక్షల పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన

రామన్నపేట మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రహదారికి, జనంపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి.సి రోడ్డు నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పటిష్టమైన రహదారులు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేటాయించిన నిధులు ప్రజలకు ఉపయోగపడేలా పారదర్శకంగా ఖర్చు చేయాలని ఆదేశించారు.

గ్రామాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతుల పనులు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News