Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 11:49 PM

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం

రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం
March 02, 2026 12:24 PM 160 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.30 లక్షల పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన

రామన్నపేట మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రహదారికి, జనంపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి.సి రోడ్డు నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పటిష్టమైన రహదారులు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేటాయించిన నిధులు ప్రజలకు ఉపయోగపడేలా పారదర్శకంగా ఖర్చు చేయాలని ఆదేశించారు.

గ్రామాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతుల పనులు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News