రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం
రామన్నపేట, జనంపల్లిలో సి.సి రోడ్లకు శ్రీకారం
Editor Desk
రూ.30 లక్షల పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన
రామన్నపేట మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రహదారికి, జనంపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి.సి రోడ్డు నిర్మాణానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పటిష్టమైన రహదారులు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేటాయించిన నిధులు ప్రజలకు ఉపయోగపడేలా పారదర్శకంగా ఖర్చు చేయాలని ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతుల పనులు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి