రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
Sthanikam joint District Staff Reporter krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని రామాలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మున్సిపల్ సభ్యులతో కలిసి పాల్గొని, దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం ప్రజలందరికీ శుభసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్పూర్తిగా ప్రార్థించారు.అలాగే ఉగాది పండుగ సందర్భంగా ఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను ఐక్యంగా జరుపుకోవడం ద్వారా సామాజిక సౌహార్దం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద మహేందర్, బాణపురం రాజు, పాండు, మనోహర్, ఖేడ్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు, సుభాష్, నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మంజూరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి