రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
Krishna
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కంది మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమం ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, వైద్య సేవలు వంటి పథకాలతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ ఫలాలు చివరి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, శుభ్రత, ఆరోగ్యం, రోడ్డు భద్రత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు చేరేలా చూడాలని సర్పంచులకు సూచించారు. రబీ సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు పెంచుతామని తెలిపారు. ఉపాధి హామీ పనులు, పాఠశాలలు, అంగన్వాడి భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి