Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:30 AM

రైతులకు తగిన మోతాదులో వెంటనే యూరియా ఎరువును సరఫరా చేయాలి

రైతులకు తగిన మోతాదులో వెంటనే యూరియా ఎరువును సరఫరా చేయాలి

రైతులకు తగిన మోతాదులో వెంటనే యూరియా ఎరువును సరఫరా చేయాలి
02-03-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బీఆర్ఎస్ మండల శాఖ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో భువనగిరి–చిట్యాల రహదారి ప్రక్కన రైతులకు యూరియా ఎరువు సరఫరాలో తీవ్ర లోపాలున్నాయని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల శాఖ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. పంటల కీలక దశలో యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరత కారణంగా పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని, రైతులు అదనపు ఖర్చులతో ప్రైవేట్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొనిందని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నాగిరెడ్డిపల్లి సహా మండలంలోని అన్ని గ్రామాలకు తగిన మోతాదులో యూరియా ఎరువును సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, గ్రామ శక్తులు,రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు తగిన మోతాదులో వెంటనే యూరియా ఎరువును సరఫరా చేయాలి

Article Image

బీఆర్ఎస్ మండల శాఖ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో భువనగిరి–చిట్యాల రహదారి ప్రక్కన రైతులకు యూరియా ఎరువు సరఫరాలో తీవ్ర లోపాలున్నాయని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల శాఖ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. పంటల కీలక దశలో యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరత కారణంగా పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని, రైతులు అదనపు ఖర్చులతో ప్రైవేట్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొనిందని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నాగిరెడ్డిపల్లి సహా మండలంలోని అన్ని గ్రామాలకు తగిన మోతాదులో యూరియా ఎరువును సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, గ్రామ శక్తులు,రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News