Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 05:52 PM

రైతులకు తగిన మోతాదులో వెంటనే యూరియా ఎరువును సరఫరా చేయాలి

రైతులకు తగిన మోతాదులో వెంటనే యూరియా ఎరువును సరఫరా చేయాలి

రైతులకు తగిన మోతాదులో వెంటనే యూరియా ఎరువును సరఫరా చేయాలి
March 02, 2026 04:29 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బీఆర్ఎస్ మండల శాఖ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో భువనగిరి–చిట్యాల రహదారి ప్రక్కన రైతులకు యూరియా ఎరువు సరఫరాలో తీవ్ర లోపాలున్నాయని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల శాఖ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. పంటల కీలక దశలో యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరత కారణంగా పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని, రైతులు అదనపు ఖర్చులతో ప్రైవేట్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొనిందని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నాగిరెడ్డిపల్లి సహా మండలంలోని అన్ని గ్రామాలకు తగిన మోతాదులో యూరియా ఎరువును సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, గ్రామ శక్తులు,రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News