Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 10:00 PM

రైతుకు వందనం అవార్డు అందుకున్న పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి

రైతుకు వందనం అవార్డు అందుకున్న పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి

రైతుకు వందనం అవార్డు అందుకున్న పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి
March 01, 2026 08:26 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రైతు పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన “రైతుకు వందనం అవార్డు”ను అందుకున్నారు. సాయి అలేఖ్య ఆర్ట్స్ మరియు బిగ్ టీవీఆధ్వర్యంలోహైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అజయ్ కుమార్ రెడ్డి అవార్డు స్వీకరించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన ఆయన, సమీకృత వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులను సాధించి, రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

వ్యవసాయ రంగంలో ఆయన సాధించిన విశేష సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఇప్పటికే “తెలంగాణ రాష్ట్ర బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు”, “బెస్ట్ ఫిష్ ఫార్మర్ అవార్డు”, “రాష్ట్ర రైతు రత్న అవార్డు”లను అందుకున్నారు. తాజాగా “రైతుకు వందనం అవార్డు” వరించడంతో ఆయన సేవలకు మరో గుర్తింపు లభించినట్లైంది.ఈ సందర్భంగా అజయ్ కుమార్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రైతుల కష్టాన్ని గుర్తించి గౌరవించే విధంగా ఇలాంటి ప్రోత్సాహక అవార్డులను ఏర్పాటు చేస్తున్న నిర్వహణ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు గుర్తింపు, గౌరవం లభించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News