Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వేసవి శిక్షణ శిబిరమును ప్రారంభించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 06:38 PM

రైతు సంక్షేమానికి వెటర్నరీ వైద్యుల సేవలు కీలకం

రైతు సంక్షేమానికి వెటర్నరీ వైద్యుల సేవలు కీలకం

రైతు సంక్షేమానికి వెటర్నరీ వైద్యుల సేవలు కీలకం
April 25, 2026 05:07 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ వెటర్నరీ వైద్యుల కార్యాలయంలో శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ గ్రామ వెటర్నరీ వైద్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో వెటర్నరీ వైద్యుల సేవలు ఎంతో కీలకమని, రైతు కుటుంబాలకు వారి సేవలు అమూల్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొని వెటర్నరీ వైద్యుల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, రైతులు కూడా పాల్గొని వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News