Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:53 PM

రైతు సంక్షేమానికి వెటర్నరీ వైద్యుల సేవలు కీలకం

రైతు సంక్షేమానికి వెటర్నరీ వైద్యుల సేవలు కీలకం

రైతు సంక్షేమానికి వెటర్నరీ వైద్యుల సేవలు కీలకం
April 25, 2026 05:07 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ వెటర్నరీ వైద్యుల కార్యాలయంలో శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ గ్రామ వెటర్నరీ వైద్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో వెటర్నరీ వైద్యుల సేవలు ఎంతో కీలకమని, రైతు కుటుంబాలకు వారి సేవలు అమూల్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొని వెటర్నరీ వైద్యుల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, రైతులు కూడా పాల్గొని వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News