PRINT TIME: April 25, 2026 09:39 PM
రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా రమేష్ గౌడ్ ఎన్నిక
రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా రమేష్ గౌడ్ ఎన్నిక
April 25, 2026 07:49 PM
11 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు ఈ నెల 23, 24, 25 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించగా, సంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి, మునిపల్లి గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమం, కౌలుదారుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. ఆయన ఎన్నికపై రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి