Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు మార్కెట్ రేటు పరిహారం ఇవ్వాలని సిపిఎం ధర్నా గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 08:47 PM

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి
April 27, 2026 06:59 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, లిఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ తదితరులు కంగ్టి మండలంలోని గజుల్‌పాడ్ గ్రామంలో రైతు మాధవరావు పాటిల్ కుటుంబాన్ని పరామర్శించారు.మాధవరావు పాటిల్‌కు చెందిన సుమారు 8 ఎకరాలు 25 గుంటల భూమి గత ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ అమలులో భాగంగా అక్రమంగా ఇతరుల పేరుపై నమోదైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయించుకోవడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన నాయకులు గ్రామ పెద్దలు, మండల అధికారులతో చర్చించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి భూమి రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ లోపాల వల్లే ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని మండిపడుతూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమ హారతి, అడిషనల్ ఎస్పీ చైతన్య, జిల్లా అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News