Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:11 AM

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి
27-04-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, లిఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ తదితరులు కంగ్టి మండలంలోని గజుల్‌పాడ్ గ్రామంలో రైతు మాధవరావు పాటిల్ కుటుంబాన్ని పరామర్శించారు.మాధవరావు పాటిల్‌కు చెందిన సుమారు 8 ఎకరాలు 25 గుంటల భూమి గత ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ అమలులో భాగంగా అక్రమంగా ఇతరుల పేరుపై నమోదైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయించుకోవడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన నాయకులు గ్రామ పెద్దలు, మండల అధికారులతో చర్చించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి భూమి రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ లోపాల వల్లే ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని మండిపడుతూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమ హారతి, అడిషనల్ ఎస్పీ చైతన్య, జిల్లా అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

రైతు కుటుంబానికి అండగా నిలిచిన కోదండరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

రైతు కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, లిఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ తదితరులు కంగ్టి మండలంలోని గజుల్‌పాడ్ గ్రామంలో రైతు మాధవరావు పాటిల్ కుటుంబాన్ని పరామర్శించారు.మాధవరావు పాటిల్‌కు చెందిన సుమారు 8 ఎకరాలు 25 గుంటల భూమి గత ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ అమలులో భాగంగా అక్రమంగా ఇతరుల పేరుపై నమోదైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయించుకోవడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడినా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన నాయకులు గ్రామ పెద్దలు, మండల అధికారులతో చర్చించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి భూమి రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ లోపాల వల్లే ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని మండిపడుతూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమ హారతి, అడిషనల్ ఎస్పీ చైతన్య, జిల్లా అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News