రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా
రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా
Sthanikam District Staff Reporter
ఇండియా మిషన్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక ఇండియా మిషన్ హై స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను,ఉపాధ్యాయులతో మరియు స్నేహితులతో ఏర్పడిన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ...విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాపన నుంచీ ఇప్పటివరకు అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తూ..ముందుకు సాగుతోందని,ఈ ఏడాది విద్యార్థులు కూడా ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి