Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:15 PM

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా
March 02, 2026 06:49 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇండియా మిషన్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక ఇండియా మిషన్ హై స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను,ఉపాధ్యాయులతో మరియు స్నేహితులతో ఏర్పడిన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ...విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాపన నుంచీ ఇప్పటివరకు అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తూ..ముందుకు సాగుతోందని,ఈ ఏడాది విద్యార్థులు కూడా ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News