Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 04:03 PM

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా
March 02, 2026 06:49 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇండియా మిషన్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక ఇండియా మిషన్ హై స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను,ఉపాధ్యాయులతో మరియు స్నేహితులతో ఏర్పడిన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ...విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాపన నుంచీ ఇప్పటివరకు అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తూ..ముందుకు సాగుతోందని,ఈ ఏడాది విద్యార్థులు కూడా ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News