PRINT TIME: June 24, 2026 07:17 PM
పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి
పుట్రేల కోటిపల్లి గ్రామాల సరిహద్దులో పేకాట శిబిరంపై విస్సన్నపేట పోలీస్ దాడి
March 03, 2026 07:17 PM
119 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
విస్సన్నపేట మండలంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని ఎస్ఐ యం. అర్జున్ రాజు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు విస్సన్నపేట, పుట్రేల, కోటిపల్లి గ్రామాల సరిహద్దులోని మామిడి తోటల్లో రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో భాగంగా ఐదుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2,830 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై జూదం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పేకాట వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై యం అర్జున్ రాజు హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి