పూలే జయంతి వేడుకలు ఘనంగా – సమానత్వం కోసం కృషి చేయాలి
పూలే జయంతి వేడుకలు ఘనంగా – సమానత్వం కోసం కృషి చేయాలి
Krishna
మహానీయ సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్,జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కలిసి పూలమాలలు అర్పించి నివాళులు సమర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అపారమని, మహిళా విద్య, సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలను ఆచరిస్తూ సమాజంలో సమానత్వం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, డా. శ్రీహరి, కౌన్సిలర్లు లాడే మల్లేశం, మనీలా, నవీన్, జలేందర్, కొత్తపల్లి శ్రీకాంత్, శ్రవణ్ రెడ్డి, అజీమ్, చింటూ, దిలీప్, ప్రదీప్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి