పొలం నుంచి పౌష్టికాహారం వరకు… మునగ పొడితో యువ రైతు సక్సెస్ స్టోరీ
పొలం నుంచి పౌష్టికాహారం వరకు… మునగ పొడితో యువ రైతు సక్సెస్ స్టోరీ
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామానికి చెందిన యువ రైతు పి. నాగరాజు వ్యవసాయంలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి, మునగ పంటను సాగు చేస్తూ దాని ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తిగా మునగ పొడిని తయారు చేస్తున్నారు. మునగలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో పాటు రక్తంలో చక్కెర నియంత్రణ, రోగనిరోధక శక్తి పెంపులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషక విలువలను ప్రజలకు సహజ రూపంలో అందించాలనే ఉద్దేశంతో నాగరాజు ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా తన పొలంలో పండించిన మునగ ఆకులను శుభ్రపరిచి, సహజ పద్ధతిలో ఎండబెట్టి నాణ్యమైన పొడిని తయారు చేస్తున్నారు.“ప్రజలకు శుద్ధమైన, పోషకాహారం అందించాలనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాను. మునగ పొడి ప్రతి ఇంటికీ చేరాలని కోరుకుంటున్నాను” అని నాగరాజు తెలిపారు. ప్రస్తుతం ఈ మునగ పొడికి స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోంది. గ్రామస్థులతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే ఈ విధానం ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తూ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా ముందుకు సాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి