Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:44 PM

పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం

పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం

పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం
01-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది.

సంస్థ అధ్యక్షులు, జిల్లా న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సమావేశం నిర్వహించగా, పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పోక్సో కేసుల విచారణలో జాప్యం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసులు, చైల్డ్ లైన్ ప్రతినిధులకు మార్గదర్శకాలు ఇచ్చారు. బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ సహాయం, పునరావాసం కల్పించడంలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

కేసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, సాక్ష్యాల సమర్పణ వంటి ప్రక్రియలు వేగవంతంగా పూర్తి చేయాలని, బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, జెజెబి కోర్టు న్యాయమూర్తి స్వాతి, సీడబ్ల్యూసీ అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. రవీందర్ రెడ్డి, సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధులు, భువనగిరి టౌన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం

Article Image

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది.

సంస్థ అధ్యక్షులు, జిల్లా న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సమావేశం నిర్వహించగా, పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పోక్సో కేసుల విచారణలో జాప్యం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసులు, చైల్డ్ లైన్ ప్రతినిధులకు మార్గదర్శకాలు ఇచ్చారు. బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ సహాయం, పునరావాసం కల్పించడంలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

కేసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, సాక్ష్యాల సమర్పణ వంటి ప్రక్రియలు వేగవంతంగా పూర్తి చేయాలని, బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, జెజెబి కోర్టు న్యాయమూర్తి స్వాతి, సీడబ్ల్యూసీ అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. రవీందర్ రెడ్డి, సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధులు, భువనగిరి టౌన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News