పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం
పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం
స్థానికం బృందం
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది.
సంస్థ అధ్యక్షులు, జిల్లా న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సమావేశం నిర్వహించగా, పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పోక్సో కేసుల విచారణలో జాప్యం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసులు, చైల్డ్ లైన్ ప్రతినిధులకు మార్గదర్శకాలు ఇచ్చారు. బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ సహాయం, పునరావాసం కల్పించడంలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
కేసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, సాక్ష్యాల సమర్పణ వంటి ప్రక్రియలు వేగవంతంగా పూర్తి చేయాలని, బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, జెజెబి కోర్టు న్యాయమూర్తి స్వాతి, సీడబ్ల్యూసీ అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. రవీందర్ రెడ్డి, సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధులు, భువనగిరి టౌన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి