Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 07:58 PM

పోచంపల్లి చేనేతకు ఊతం – కార్మికుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి

పోచంపల్లి చేనేతకు ఊతం – కార్మికుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి

పోచంపల్లి చేనేతకు ఊతం – కార్మికుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
March 01, 2026 06:17 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

పోచంపల్లి గ్రామంలోని చేనేత సహకార సంఘం మరియు చేనేత యూనిట్లను అనురాగ్ జయంతి శనివారం సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు. చేనేత కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి పనితీరు, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సంఘం ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తోందో, తయారైన వస్త్రాలను ఎక్కడ విక్రయిస్తున్నారో తెలుసుకొని తగిన సూచనలు చేశారు. అనంతరం సాయిని భారత్‌కు చెందిన చేనేత యూనిట్‌ను సందర్శించి చీరల తయారీ వివిధ దశలను పరిశీలించారు. చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని అభినందిస్తూ వారి శ్రమే ఈ రంగానికి బలమని పేర్కొన్నారు.

కార్మికుల ఇళ్లను సందర్శించిన కలెక్టర్ వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. నెలవారీ ఆదాయం, పట్టుదారం కొనుగోలు విధానం, తయారైన చీరల విక్రయ మార్గాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఏ అవసరం ఉన్నా అధికారులకు తెలియజేయాలని భరోసా ఇచ్చారు.

ప్రసిద్ధ పోచంపల్లి ఇక్కత్ చీరల తయారీ విధానం, డిజైన్ ప్రక్రియ, టై-అండ్-డై పద్ధతిలో ముందుగానే డిజైన్ వేయడం వంటి ప్రత్యేకతలను ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశ విదేశాల్లో ఈ చీరలకు ఉన్న డిమాండ్, రంగుల సమన్వయం, సంప్రదాయ కళాత్మకత పోచంపల్లిని చేనేత రంగంలో ప్రత్యేక స్థాయికి చేర్చాయని తెలిపారు. ఒక చీర తయారీలో అనుసరించే దశల వారీ ప్రక్రియను కళాకారులు కలెక్టర్‌కు వివరించారు.

చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికులకు మరింత ప్రోత్సాహం అందించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, చేనేత శాఖ అధికారులు, సహకార సంఘం చైర్మన్ భారత వాసుదేవ్, సోసైటీ సభ్యులు, స్థానిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News