Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:05 PM

పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం

పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం

పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం
April 15, 2026 09:41 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం నిర్మాణానికి గ్రామస్థులు సహకారం అందిస్తున్న వేళ, ఇటీవల వీరభద్రేశ్వర జాతర మహోత్సవం సందర్భంగా ప్రదర్శించిన “పెద్దిరాజు పెద్దమ్మ” పౌరాణిక నాటకంలో పాల్గొన్న నాటకమండలి సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నాటకంలో పాత్రధారులకు కట్నకానుకల రూపంలో వచ్చిన సుమారు 60,000 రూపాయలను వ్యక్తిగతంగా వినియోగించకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా దైవకార్యానికి వినియోగించాలని అందరూ కలిసి నిర్ణయించారు. బుధవారం గ్రామ పెద్దలు మరియు దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ మొత్తాన్ని పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నాటకమండలి సభ్యులు మాట్లాడుతూ దైవకార్యానికి సహాయం చేయడం తమకు సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నాటకమండలి సభ్యుల ఈ సేవా భావాన్ని గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అభినందిస్తూ, ఇది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News