ఫోన్ ట్యాపింగ్ పేరిట కేసీఆర్పై కక్షసాధింపు చర్యలు
ఫోన్ ట్యాపింగ్ పేరిట కేసీఆర్పై కక్షసాధింపు చర్యలు
Editor Desk
- కేసారం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన,రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి పిలుపుమేరకు,భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామశాఖ అధ్యక్షులు కమ్మగాని నర్సింహా గౌడ్ గారి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సత్యనారాయణ, పోచయ్య, సత్యనారాయణ, భాస్కర్, బాలయ్య, రాములు, ఆంజనేయులు, భాస్కర్, ఇమ్రాన్, నర్సింగ్ రావు, సుభాష్, సురేష్, గణేష్, ఉమేష్, సాయి, సంపత్, వంశీ, ఐలెయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరై సంఘీభావం తెలిపారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ గారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ, బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలనే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి