Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాయం చేయండి – కలెక్టర్‌ను ఆశ్రయించిన ఐకేపీ వివో జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు! 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 06:33 PM

ఫోన్ ట్యాపింగ్ పేరిట కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలు

ఫోన్ ట్యాపింగ్ పేరిట కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలు

ఫోన్ ట్యాపింగ్ పేరిట కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలు
February 01, 2026 07:47 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

- కేసారం గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన,రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో గౌరవ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి పిలుపుమేరకు,భువనగిరి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామశాఖ అధ్యక్షులు కమ్మగాని నర్సింహా గౌడ్ గారి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సత్యనారాయణ, పోచయ్య, సత్యనారాయణ, భాస్కర్, బాలయ్య, రాములు, ఆంజనేయులు, భాస్కర్, ఇమ్రాన్, నర్సింగ్ రావు, సుభాష్, సురేష్, గణేష్, ఉమేష్, సాయి, సంపత్, వంశీ, ఐలెయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరై సంఘీభావం తెలిపారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ గారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ, బీఆర్‌ఎస్ పార్టీని అణిచివేయాలనే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News