Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 07:58 PM

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు
March 01, 2026 06:12 PM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కోర్టు భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

కేసుల విచారణలో జాప్యం తగ్గించడంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం అందించడం, సాక్షి రక్షణ పథకం–2018 అమలు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని న్యాయాధికారులు, పోలీసు అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, అదనపు పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మి నారాయణ, సబ్‌జైలు సూపరింటెండెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News