Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 02:55 AM

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు
March 01, 2026 06:12 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కోర్టు భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

కేసుల విచారణలో జాప్యం తగ్గించడంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం అందించడం, సాక్షి రక్షణ పథకం–2018 అమలు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని న్యాయాధికారులు, పోలీసు అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, అదనపు పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మి నారాయణ, సబ్‌జైలు సూపరింటెండెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News