Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:49 PM

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు
01-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కోర్టు భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

కేసుల విచారణలో జాప్యం తగ్గించడంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం అందించడం, సాక్షి రక్షణ పథకం–2018 అమలు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని న్యాయాధికారులు, పోలీసు అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, అదనపు పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మి నారాయణ, సబ్‌జైలు సూపరింటెండెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కోర్టు భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

కేసుల విచారణలో జాప్యం తగ్గించడంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం అందించడం, సాక్షి రక్షణ పథకం–2018 అమలు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని న్యాయాధికారులు, పోలీసు అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, అదనపు పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మి నారాయణ, సబ్‌జైలు సూపరింటెండెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News